ఎన్ని రాజు ఆధ్వర్యంలో అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన

ఉమ్మడి శ్రీకాకుళం, రాజాం నియోజకవర్గం, సోమవారం విశాఖపట్నం నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మరియు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం జనసేన పార్టీ సమన్వయకర్త ఎన్ని రాజు ఆధ్వర్యంలో ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ అంబేద్కర్ కూడలి నందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ “మా నాయకులు మనోహర్ మరియు ఇతర మాయుకులు తైకున్ హోటల్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ, నిరసన తెలియజేయటానికి వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేయటం రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం, అలాగే రాజకీయ పార్టీల గొంతును నొక్కిపెట్టటం సరైనపద్దతి కాదని” తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మరియు జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.