పాలకొల్లు మండలం జనసేనలో బీసీ, ఎస్సీల చేరిక

  • వైసీపి నుండి జనసేనకు భారీ చేరికలు

పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) కార్యాలయం భీమవరంలో జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు సిద్దిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల నుండి వైసీపీ నాయకులు జనసేనపార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పాలకొల్లు మండలం భగ్గేశ్వరం, ఆగర్రు, సగం చెరువు గ్రామాల నుంచి భారీగా బీసీ, ఎస్.సి సోదరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ పిఏసి మెంబర్ కనకరాజు సూరి, ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమళ్ళ చంద్రశేఖర్, యలమంచిలి మండలం అధ్యక్షులు కొడవటి వరబాబు, పాలకొల్లు మండల నాయుకులు సాధనాల దుర్గబాబు, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు శిడగం సురేంద్ర, పాలకొల్లు నియోజకవర్గ నుండి పినిశెట్టి శ్రీనివాస్, విన్నకోట గోపి, బిట్టా లక్ష్మీ నారాయణ, ఎంపీటీసీ లు యర్రంశెట్టి నరసింహరావు, బొలిశెట్టి రమేష్, పెనుమదం ఎంపీటీసీ మానేపల్లి శ్రీధర్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ వలి, బండారు రాజేష్, అలుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.