జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం, బొల్లవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, అరెస్టులు చేయటం మాత్రమే తెలుసు, పరిపాలన చేయటం చేతకాదు. ముప్పాళ్ళ మండలంలో టీడీపీ నాయకులు కన్నాను అడ్డుకున్న పోలీసులు, నేడు వైజాగ్ లో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అడ్డుకొని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వం చేతకాని, అసమర్థకు నిదర్శనం. ఒక పక్క తుఫాన్ ప్రభావంతో పంటలను నష్ట పోయి తీవ్ర కష్టాలు అనుభవిస్తుంటే అధికారం ఉందనే అహంభావంతో విర్రవిగుతుంది వైసీపీ ప్రభుత్వం. రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్తారన్న బొర్రా. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.