కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో రాస్తారోకో

విశాఖపట్నం వి.ఐ.పి రోడ్డులో గల టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ జనసైనికులు శాంతియుతంగా విశాఖపట్నంలో ధర్నా చేస్తున్న వారికి మద్దతుగా పాల్గొనడానికి వెళుతున్న జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సెంటర్లో రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన కాకినాడ రూరల్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.