జనసేన మహాయజ్ఞం 734వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 734వ రోజు కార్యక్రమం మంగళవారం కిర్లంపూడి మండలం, జగపతినగరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 735వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగమహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి కాలపురెడ్డి వీర రాఘవ (నాని), కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, ఎస్. తిమ్మాపురం నుండి పిల్లా శ్రీనివాస్, నడిపల్లి సతీష్, సింహాద్రిపురం నుండి కందా బాబి, వీరవరం నుండి బుక్కా వెంకట సతీష్, మలిరెడ్డి విష్ణు, రావులపూడి దొరబాబు, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బూరుగుపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సైనం రాజు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.