పింజురుకొండలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం భీముడుపాకలు పంచాయతీ పింజురుకొండ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి కార్యక్రమం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీలు 2024లో అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం,పొడుగు సాయి, ముత్యాల చిన్నారెడ్డి, అడ్డతీగల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి, ఉపాధ్యక్షులు మేడిశెట్టి శ్రీను, చెక్క వీరలక్ష్మి, ముర్ల సత్యవతి, ధర్మన్న దొర, రామకృష్ణారెడ్డి, గనిరెడ్డి భాస్కరరావు, సింథోజు సోమరాజు,కుంజం నాగమణి, జనసేన తెలుగుదేశం పార్టీలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.