అంగన్వాడి టీచర్ల నిరసన దీక్షకు చిలకం మధుసూదన్ రెడ్డి సంఘీభావం

  • ధర్మవరం పట్టణంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడి టీచర్లుకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా తప్పుడు వాగ్దానాలతో మోసం చేశారని వారికి కనీస వేతనం 26వేల రూపాయలుగా ప్రకటించాలి అలాగే గతంలో పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని అబద్ధపు మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దె ఎక్కిన ఈ ప్రభుత్వం వీటిని అమలు చేయకపోవడం అన్యాయమని అలాగే గ్రాట్యుటీ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేసి అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీరికున్న ఈ ప్రధాన సమస్యలన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అమలు చేసే విధంగా కృషి చేస్తానని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హామీ ఇచ్చారు.