ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

విజయనగరం జిల్లా: జనసేన పార్టీ 37వ డివిజన్ లో శుక్రవారం ఉదయం నూతన కార్యాలయం స్థానికంగా ఉన్న జనసేన పార్టీ యువజన నాయకుడు కోర్ణన రామకృష్ణ మరియు బీసీ కాలని జనసైనికులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశ్వని, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ సమక్షంలో పార్టీ కార్యాలయం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పార్వతీపురం నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాడ మోహన్, జిల్లా సీనియర్ నాయకులు మురళి మోహన్, మామిడి దుర్గా ప్రసాద్, జిల్లా ఐటీ కో ఆర్డినేటర్ బెల్లాన అచ్చుత్, గజపతి నగరం యువ నాయకులు పడాల శరత్ కుమార్, చీపురుపల్లి ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, త్రివేది, ప్రవీణ్ రౌతు సతీష్, ముత్యాల నాయుడు మరియు టీడీపీ నాయకులు వర్జిపర్తి రమణ, ఇమంది సూరిబాబు, ఆదినారాయణ, ఎ రాజు, జనసైనికులు, వీరమహిళలు మాత గాయత్రీ, పుష్ప కుమారి తదితరులు పాల్గొన్నారు.