తాటి రామకృష్ణను జనసేనలోకి ఆహ్వానించిన తంబళ్లపల్లె రమాదేవి

నందిగామ నియోజకవర్గం: నందిగామ పట్టణంలో వైకాపా పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన తాటి రామకృష్ణ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన పిమ్మట ఆ పార్టీలో విధానాలు నచ్చక పార్టీకి బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గూర్చి తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్ళిన జనసేన నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త రమాదేవి శాలువాతో సత్కరించి పలు విషయాలు చర్చించి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరగింది. పార్టీకి మీ అనుభవం ఎంతో అవసరం. మీ వంటి మేధావులు ఎప్పుడూ జన హితం కొరకు నడవాలని మీకు జనసేనలో సముచిత స్థానం కల్పించి పార్టీ గౌరవించుకుంటుందని తెలిపారు. రామకృష్ణ త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల శ్రీ లక్ష్మి యాదవ్, అవుల పార్వతి, వెంకట నరసమ్మ, కార్యదర్శి తెప్పలి కోటేశ్వరరావు, వెంకటేష్, తేజ, శ్రీ రామ్ లు పలువురు పాల్గొని ఆహ్వానించారు.