జనసేన కార్యకర్తల కుటుంబాలకు జనసేన బరోసా

కనిగిరి నియోజకవర్గం: పామూరు మండలము, గోపాలపురం గ్రామము జనసేన పార్టీ కార్యకర్త కూడల కొండలరావు ప్రమాదవశాత్తు బండి యాక్సిడెంట్ కు గురై, బొట్ల సుబ్బారాయుడు అనే రైతు పంటలు సరిగా పండక అప్పుల బాధ పడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వారి ఇరు కుటుంబాలని కనిగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఆదేశము మేరకు పరామర్శించి వారికి జనసేన పార్టీ తరపున ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి రహిముల్లా, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, పామూరు మండలము అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, ప్రముఖ వ్యాపార వేత్త మాదాసు రమేష్, డేగ సూర్య నారాయణ పాల్గోన్నారు.