నంద్యాల జనసేన ఆధ్వర్యంలో జగన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

  • అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందిస్తామంటున్న జనసేన నాయకులు

నంద్యాల: స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో శుక్రవారం జనసేన నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసిపి మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ కి కేసులు ఉన్న జగన్కు పొంతనలేదని విమర్శించారు. అక్రమ కేసులను బనయించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు పిడతల సుధాకర్, సందీప్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.