అంగనవాడీలపై ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి

పోలవరం నియోజకవర్గం: పోలవరం పట్టణంలో గత 9రోజులుగా సాగుతున్న అంగనవాడి సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరావధిక సమ్మెకు బుధవారం మండల అధ్యక్షులు గునపర్తి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు వారి సమస్యలు చిర్రి బాలరాజు గారికి విన్నవించుకున్నారు. అంగన్వాడి కేంద్రాల తాళాలు సచివాలయం సిబ్బంది పగలు కొట్టడం విస్మయానికి గురి చేసిందన్నారు. దేవాలయంలా భావించే అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీలు కోరుకునే 26,000 కనీస వేతనం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాటిట్యూడ్ అమల్లోకి తీసుకు రావడం, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనాల్లో సగం పింఛన్, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించడం, లబ్ధిదారులకు సరైన సరుకులు అందించడం తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వంతీర్చాలని డిమాండ్ చేశారు.నిన్న భిక్షటన చేసామని, నేడు వంటావార్పు కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. తమ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలు తీర్చడంలో మద్దతుగా నిలిచినటువంటి జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు గారికి మండల అధ్యక్షులు చిన్ని, కార్యకర్తలకు నాయకులకు అందరికీ సిఐటియు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలగంశెట్టి రాము, కురసం రమేష్, వనిమిరెడ్డి సీతయ్య, కొక్కెర సత్తిబాబు, ఏ. రాధాయ్య, మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసద్, టీ. నరసింహ మూర్తి, కే. సురేష్, కిషోర్, పి. శ్రీను, పల్లపు స్వామి, నాగేంద్ర, సిద్దన రామకృష్ణ, సిద్దన రాంబాబు, ఎస్. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.