ఎల్.కోటలో జనంలోకి జనసేన

ఎల్.కోట నియోజకవర్గంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించారు. 200 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దాసుల్లపాలెం, కల్లేపల్లి, రేగ గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పార్టీ తీర్థం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని పాల్గొని మండలంలో అన్ని గ్రామాల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.