సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటి: ముత్తానగర్ వినాయకుడు గుడి, అంబేద్కర్ బొమ్మ దగ్గర దుగ్గన బాబ్జి ఆధ్వర్యంలో సత్యన్నారాయణ ఇంటి నందు కాకినాడ జనసేన పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ చే క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి ప్రాంత క్రిస్టియన్ సోదర సోదరీమణుల కుటుంబాలతో కలిసి ముత్తా శశిధర్ ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ అందరిపై చూపిస్తూ నడుచుకోవాలని బైబిల్ మనకి నిర్దేశిస్తోందనీ మనమందరం అది ఆచరించి ఆ ప్రభువు ప్రేమకు పాత్రులమవ్వాలని ఆకాంక్షించారు. ఇతరులకి సహాయం అందించడంలోనే దేవుని పట్ల నమ్మకాన్ని తెలియచేయడం అనీ, ఈ క్రిస్మస్ పండుగ దీనుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ, సత్యన్నారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.