జగన్ అబద్దాలను నమ్మి ఉద్యోగులు నిలువునా మోసపోయారు

  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల తీవ్రంగా స్పందించిన అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ

రాజమహేంద్రవరం, ముఖ్యమంత్రి పదవి పొందేందుకు అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను జగన్ నిలువునా ముంచారని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో అంగన్వాడీలు నిరసన దీక్ష శిబిరం వద్ద జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రజాస్వామ్యవద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం జగన్ మాట తప్పడమే అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బెదిరింపులు మానుకొని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు దాసరి గురునాధరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాషా లిమ్రా, సిటీ కార్యదర్శి విన్న వాసు మరియు జనసేన నాయకులు విక్టరీ వాసు, విజయ్ అక్కిరెడ్డి ప్రసాద్ విజయ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.