యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

రాజానగరం: సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట, ముగ్గళ్ళ గ్రామంలో యువతకు స్పోర్ట్స్ కిట్స్ ను జనసేన పార్టీ యువజన నాయకుడు తోట పవన్ కుమార్ అందజేసారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి కిట్స్ అందించడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.