నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్

నేడు సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానానికి వచ్చి, అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్‌కు చేరుకుంటారు. సీఎం వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పాలమూరుకు వెళ్లనున్నారు.