విద్యార్దులకు వక్తృత్వ పోటీలు

  • విద్యార్దులలో గల సృజనాత్మక పెంపొందించాలనే ఉద్దేశంతో వక్తృత్వ పోటీలు -చైర్మన్ జ్యోతుల గంగభవానీ

పిఠాపురం నియోజకవర్గం: సాయిప్రియ సేవాసమితి, పిఠాపురం నియోజకవర్గం ఆధ్వర్యంలో వివేకనంద జన్మదినోత్సవం & జాతీయయువజనఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నందు విద్యార్థినీ, విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించడం జరిగింది.”నేటి రాజకీయాలలో యువకులు” పాత్ర అనే విషయంపై గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల నందు పోటీలను నిర్వహించడం జరిగింది. ఉదయం 09:30 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు వక్తృత్వ పోటీలలో గెలిచిన సీనియర్స్ విభాగం నందు ప్రధమ, ద్వితీయ, తృతీయ. జూనియర్స్ విభాగం నందు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థాయిలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతులను చేబ్రోలు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు ఏర్పాటుచేసిన సభ నందు చేబ్రోలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉలవకాయల రాంబాబు అధ్యక్షతన ముఖ్యఅతిథిగా సాయిప్రియ సేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగాభవానీ, జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ధూళిపూడి వీరాస్వామి, సాయిప్రియ సేవా సమితి కార్యదర్శి మేకల కృష్ణ సాయిప్రియసేవాసమితి, పాఠశాల పేరెంట్స్ వైస్ చైర్మన్ ములికే శ్రీను, కమిటీ కార్యవర్గ సభ్యురాలు పేకేటి వీరమణి, చేబ్రోలు జిల్లాపరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయినీ,
ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు సమక్షంలో పంపిణీ కార్యక్రమం జరిగినది. జ్యోతుల గంగాభవానీ మాట్లాడుతూ గ్రామీణప్రాంతాలలో విద్యార్థులలో గల అంతర్గతంగా ఉన్నా శక్తి సామర్ద్యాలను అభివృద్ధిపర్చాలనే ఉద్దేశంతో సాయిప్రియసేవాసమితి ఇటువంటి కార్యక్రమాలను రూపొందించామని తెలియజేశారు. బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సీనియర్స్ ప్రథమ బహుమతి పి లావణ్య, ద్వితీయ బహుమతి బి దీపికసౌమ్య, తృతీయ బహుమతి భువనేశ్వరి జూనియర్స్ ప్రథమ బహుమతి కె గాయత్రి, ద్వితీయ బహుమతి కీర్తన, తృతీయ బహుమతి జహ్నావి బహుమతులను, మెమోంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉదయం 11:00 గంటలకు గొల్లప్రోలు మండలం దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల నందు వక్తృత్వ పోటీలలో గెలిచిన సీనియర్స్ విభాగం నందు ప్రధమ, ద్వితీయ, తృతీయ. జూనియర్స్ విభాగం నందు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థాయిలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతులను దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల నందు ఏర్పాటుచేసిన సభనందు దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి అధ్యక్షులు అధ్యక్షతన ముఖ్యఅతిథిగా సాయిప్రియ సేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగాభవానీ, సాయిప్రియ సేవా సమితి కార్యదర్శి మేకల కృష్ణ సాయిప్రియ సేవాసమితి కార్యవర్గ సభ్యురాలు పేకేటి వీరమణి, దుర్గాడ జిల్లా పరిషత్ హై స్కూల్ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, రాజకూమార్, సొమన్నదోర, ప్రభాకర్, సూర్యనారాయణ, పద్మకూమార్, జగదీష్ బాబు విద్యార్థినీ, విద్యార్థులు సమక్షంలో పంపిణీ కార్యక్రమం జరిగినది.
కార్యక్రమాలలో కీర్తి చిన్న కోలనాని, మేడిబోయిన హరికృష్ణ, నాగబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.