శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు 6వ డివిజన్ చాటపర్రు రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారి ప్రాంగణంలో “సంక్రాంతి సంబరాల మహోత్సవములు” అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి సంబర మహోత్సవంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎమ్.సత్యనారాయణ గారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఇక్కడకు విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. బాలాజీ నగర్ చాటపర్రు రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ గారు మరియు వారి టీమ్ అందరు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించడం జరిగింది. హిందూ సంప్రదాయాలను పిల్లలకు కూడా అలవాటు చేసే విధంగా ఈ స్కూల్లో గొబ్బెమ్మలు కానీ, భోగి మంటలు కానీ, పాలు పొంగించడం కానీ, హరిదాసుల వేషాలు, ముగ్గుల పోటీలు, కోలాటాలు, ఆటపాటలతో ఈ యొక్క స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం చాలా మంచి పరిణామం అని, మన యొక్క సాంప్రదాయాలు మర్చిపోకుండా ఈ యొక్క స్కూల్లో ఉన్న పిల్లలకు హిందూ సంప్రదాయాలను అలవాటు చేసి చాలా మంచి పరిణామంగా భావిస్తున్నామని, నన్ను ముఖ్యఅతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.. ఈ సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ముందు ముందు ఇంకా ఇలాంటి సంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని, సంప్రదాయాలు పెరగాలని అందరూ మంచి క్రమశిక్షణతో దేశం పట్ల భక్తితో ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మేనేజ్మెంట్ వారికి పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.