వైసీపీ విద్వంసం.. అక్రమ కట్టడాలు అంటూ పేదల ఇళ్లు కూల్చిన రెవెన్యూ అధికారులు..!
తిరుపతి: తిరుపతి నగరంలోని రాయల్ నగర్ సమీపంలో.. బండారి కాలనీ దగ్గర గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు టి. మునెమ్మ, ఆర్. నీల, ఆర్. మంజుల, ఎం. దనమ్మ నివాస గృహాలను అక్రమ కట్టడాలు అంటూ.. వై.ఎస్.ఆర్.సి.పి ప్రజా ప్రతినిధి మరియు కార్పొరేటర్లు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అతి క్రూరంగా.. ఈ నలుగురినీ అదుపు చేయడానికి యాభై మంది పోలీసులను తీసుకొని వచ్చి.. కనీసం నోటీసు ఇవ్వకుండా.. వస్తు సామాగ్రిని బయట తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా.. జెసిపి మిషన్లతో పడగొట్టారు. దీనికి సాక్ష్యంగా.. ఫోటోలు జతచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నలుగురు జనసేన పార్టీకి సానుభూతిపరులు ఇది ఓర్వలేక వారు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు.