అంగన్వాడీలపై ఎస్మా రద్దు చేయాలి
- అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం
రంపచోడవరం: అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. అంగన్వాడీలపై ఎస్మా రద్దు చేయాలని వాళ్లకు తగిన వేతనాలను తక్షణమే పెంచవలసిందిగా అఖిలపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అఖిలపక్ష మీటింగ్ కి రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున టిడిపి జనసేన సమన్వయ కమిటీ అధ్యక్షుడు కుర్ల రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పి.ఆర్.పి శ్రీను పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-7.55.49-PM-1-1024x461.jpeg)