నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన డా. మాధవరెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జై గణేష భక్తి సమితి తెలంగాణ మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డా. మాధవరెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్ సోషల్ మీడియా కార్యనిర్వహణ సభ్యులు శ్రవణ్ కుమార్ జి.ఎస్.కే అధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గణేష భక్తి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్ మరియు రాష్ట్ర సభ్యులు లక్ష్మణ్, గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు కే.మహేందర్, సంగారెడ్డి సభ్యులు వి.రమేష్, నియోజకవర్గ సభ్యులు, జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు బి.అరుణ్ కుమార్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మాధవరావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలు మద్దూరి నాగలక్ష్మి, ఐటి టీమ్ సభ్యులు సునీల్, బాలాజీ, వీరమహిళలు ఇందుమతి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.