వైసిపి వల్ల కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధిద్దాం- స్వర్ణాంధ్రప్రదేశ్ ని స్థాపిద్దాం
- నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి
నందిగామ నియోజకవర్గం: వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామ ప్రజలు మరియు గ్రామ నాయకులతో బుధవారం నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి పొత్తుకు మద్దతు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం వల్ల కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధిద్దాం, స్వర్ణాంధ్రప్రదేశ్ ని స్థాపిద్దాం అన్నారు. ఎలక్షన్ ఇయరింగ్ పట్ల తమకు ఎటువంటి అవగాహన లేదని అక్కడ జనసైనికులు రమాదేవికి తెలియజేయగా.. అందుకు ఆమె సమాధానం ఇస్తూ, త్వరలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ గవర్నమెంట్ అధికారులతో వర్క్ షాప్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరలపాడు మండల అధ్యక్షుడు బేతనపూడి జయరాజు, పొన్నవరం 5వార్డు జనసేన మెంబర్ పసుపులేటి శ్రీనివాసరావు, ఎ.వర కుమార్, కోటి, అరవింద్ మరియు జుజ్జూరు గ్రామ ప్రజలు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-18-at-6.53.20-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-18-at-6.53.20-AM-1-1024x768.jpeg)