అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన నాయకులు

రంపచోడవరం నియోజకవర్గం: డి.వెలమలకోట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవటంతో వెలుగూరి సూరమ్మ నిస్సహాయులుగా మిగిలిపోయారు. విషయాన్ని గోరమామిడి గ్రామానికి చెందిన వెలుగూరి గిరి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సమాచారం ఇవ్వగా గిరి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కాకి స్వామి, శనివారం రోజు వెళ్లి ప్రమాద కారణాలు తెలుసుకుని, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ఆమెకు 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ నర్సీ ఎర్రయ్య, పోలోజి వెంకటేష్, చుప్పల కన్నా, కోసం శివ, దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు, సీనియర్ నాయకులు సాదల సన్యాసి రెడ్డి, కుంజం శ్రీను, మొదలైనవారు పాల్గొన్నారు.