రోషితా రెడ్డిని పరామర్శించిన వినుత కోటా

  • టీడీపీ ఇంఛార్జి సుధీర్ రెడ్డి భార్యని పరామర్శించిన జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం : టీడీపీ శ్రీకాళహస్తి ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రోషితా రెడ్డి శనివారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు ప్రచారం నిర్వహిస్తున్నపుడు కొంత మంది వైసీపీ కార్యకర్తలు వారి వాహనాన్ని అడ్డుకుని అసభ్యంగా వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఆదివారం ఊరందురులోని వారి ఇంటికి నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరి హక్కు అని, అడ్డుకోవడం ఏ సంస్కృతి అని తెలిపారు. వైసీపీ ఆగడాలను ధీటుగా ఎదుర్కొంటామని, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని మద్దతు తెలిపడం జరిగింది. పోలీసులు ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.