పేరవరం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో మంగళవారం రాత్రి ఎస్సీ పేటకు చెందిన పెద్దలు, యువత జనసేన నాయకులు తలారీ రమేష్ ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-24-at-1.08.55-PM-1024x576.jpeg)