శ్రీకాళహస్తిలో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఉన్నత విద్యావంతులు ఆర్.సి.ఆర్ కాలేజి ప్రిన్సిపాల్, శ్రీకాళహస్తికి చెందిన డా.ఎన్.జి.ఏ ప్రసాద్ వారి మద్దతు దార్లతో కలిసి సోమవారం జనసేన పార్టీలో చేరారు. డా.ఎన్.జి.ఏ ప్రసాద్ కి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ పార్టీ గెలుపుకోసం చాలా క్రియాశీలకంగా పని చేసి, వారి కాలేజిలో చదువుకున్న వేల మంది స్టూడెంట్స్ సైతం శ్రీకాళహస్తిలో వైసీపీ గెలుపుకి పనిచేశారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రజలు కోరుకున్న ఎలాంటి మార్పు జరగకపోవడంతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే యువత ఆశించే మార్పు సాధ్యం అని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నట్టు, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తనకి విశేషంగా పరిచయాలు ఉన్న వేల మంది విద్యార్థులను సైతం శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ గెలుపు కొరకు కృషి చేసేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఇంఛార్జి తోట గణేష్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.