వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

ప్రత్తిపాడు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం, మండపం గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాల్ని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సందర్శించడం జరిగింది. నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు మాట్లాడుతూ పేదవారికి కేటాయించిన ఈ జగనన్న ఇళ్ల స్థలాల వ్యవహారంలో పూర్తిగా అవినీతి, అవకతవకలు జరిగాయని, ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం గ్రామంలోని లబ్ధిదారులకు ఈ మండపం గ్రామంలో ఇళ్ల స్థలాల్ని ఇవ్వటం జరిగింది, ఎవరూ కూడా ఇక్కడ ఇళ్ళు నిర్మించుకోలేని పరిస్థితి కనిపిస్తోందని ఎక్కడైతే ఈ వైసీపీ నాయకులకు కమిషన్ లు బాగా వస్తాయో ఆ స్థలాల్ని ఎంపిక చేసుకుని లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇదంతా వైసీపీ నాయకులు లక్షల్లో అవినీతి చేసారని వైసీపీ అధికార పార్టీ నాయకులు ఈ ఇళ్ల స్థలాల్లో చేసిన అవినీతిని బట్టబయలు చేసే దిశగా ఈ మూడు రోజుల పాటు జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు దోపిడీపై కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి తెలియజేస్తామని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల వైస్ ప్రెసిడెంట్ సుంకర చక్రి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, రౌతులపూడి మండల అధ్యక్షులు పల్లా శేఖర్, మెరక చామవరం అధ్యక్షులు అర్జున్, పెద్దనాపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కరణం రాజారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.