రాజకీయ కబంధ హస్తాల చెరనుంచి మిస్సమ్మ కాలని వాసులకు విముక్తి కలిగేనా..?

• అరవింద్ నగర్ మిస్సమ్మ కాలనీలో దశాబ్ద కాలంగా నివాసం ఉంటున్న వందలాది కుటుంబాలకు న్యాయం దక్కేది ఎన్నటికో…

•జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపన అనంతరం మిస్సమ్మ కాలని వాసులకు డీ ఫారం పట్టాలు అందించే విధంగా కృషి చేస్తాం.

  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత.

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా 17వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గలోని స్థానిక 30వ డివిజన్ అరవింద్ నగర్ మిస్సమ్మ కాలనీలలో పర్యటించి ఇక్కడ స్థానిక ప్రజలనుంచి పలు సమస్యలను తెలుసుకొని ఈ విధంగా మాట్లాడారు. ఈ కాలనీలో ఏ మహిళను అడిగిన ఏ ఇంటికి వెళ్ళినా వారు చెప్పే మాట ఒకటే అని గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము అయినప్పటికీ మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని రాజకీయ నాయకుల వత్తిల్లతో ఇక్కడ భయం భయంగా బ్రతుకుతున్నామని అంటున్నారని ఇక్కడ దాదాపు 870 కుటుంబాలు నివాసం ఉంటున్నారని వీరికి ఇళ్ల పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం వీరిని పట్టించుకోక తీవ్ర మౌలిక సదుపాయాల కొరతతో బాధపడుతున్నారని రోడ్లు, మురుగుకాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీరి సమస్యల పరిష్కారానికి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపన అనంతరం కచ్చితంగా చర్యలు తీసుకోని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యేలా చేసి రాజకీయ కభంద హస్తాల చెరనుంచి మిస్సమ్మ కాలనీని రక్షిస్తామని కచ్చితంగా ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు శ్రీదేవి నాగేంద్రమ్మ గంగారత్నమ్మ 30వ డివిజన్ ఇంచార్జ్ రాజేష్ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది.