సింగరాయకొండలో వైసీపీని వీడి జనసేనలో చేరిన 25 కుటుంబాలు

కొండెపి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా 25 కుటుంబాలను జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీలో చేరిన వారిలో సింగరాయకొండ మరియు టంగుటూరు మండలాలకి చెందిన వారు, వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో మండలంలో జనసేన పార్టీ ఎదుగుదలకి అభివృద్ధికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేశారు, కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీలో నూతన ఉత్సాహం ఏర్పడింది, జనసేన మరియు టిడిపి ఉమ్మడి అభ్యర్థిని కొండపిలో గెలిపించాలని జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు తెలియజేశారు, వైసీపీ నాయకులు ఎస్.డి కాజాహుస్సేన్ (వై.ఎస్.ఆర్.టి.యు.సి), ఎస్.డి తస్లీమ్ (మూలగుంటపాడు 9 వ వార్డు మెంబర్), ఎస్.కె కరీమ్ భాష, పి మల్లికార్జున, ఎస్.కె ఖాజావలి, పలని రాజా, పలని రామచంద్ర, పలని యుగంధర్, వి నెలమాల, ఎస్.కె రజియా (వైసీపీ మహిళ నాయకురాలు), ఎస్.కె రసూల్, లింగంగుంట చంద్రవాస్ (వాసేపల్లి పాడు గ్రామం వైసీపీ సర్పంచిగా పోటీ చేసిన వ్యక్తి) మరియు కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో కనపర్తి మనోజ్ కుమార్ మరియు సింగరాయకొండ, టంగుటూరు మండలాల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.