గిరిజన గ్రామాలలో పర్యటించిన నిమ్మల నిబ్రమ్

పాలకొండ నియోజకవర్గం: సీతంపేట మండలం, గిరిజన గ్రామాలైన అంటికొండ మంద, ఇత్తమనుగుడ మరియు పెద్దగూడ గ్రామాల్లో మాజీ జెడ్పీటీసీ నియోజక వర్గ జనసేన సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ పర్యటించారు. ఈ సందర్బంగా సీతంపేట జనసేన నాయకులు, జనసైనికులు మాట్లాడుతూ పాలకొండలో నిశ్శబ్దం ఉన్న జనసేనకి ఊపిరిపోస్తున్నా జనసేన నాయకులు, పాలకొండ నియోజకవర్గం సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ కు ధన్యవాదములు తెలియజేయ్యడం జరిగింది. సీనియర్ రాజకీయ నాయకులు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో విద్యార్థుల మంచిగా చదువుకోండి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అలానే ప్రతి ఒక్కరికి రాజకీయ పరిజ్ఞానం ఉండాలని, కచ్చితంగా పొత్తులో ఎవ్వరికి పాలకొండలో టికెట్ వచ్చిన గెలుపే లక్ష్యంగా పని చేద్దాం అని తెలియజేశారు. ఈ పర్యటనలో సీతంపేట జనసేన నాయకులు సవర సింహాద్రి, సవర రాజేష్, గణేష్, కోటి మరియు జనసైనికులు పాల్గొన్నారు.