మనుబోలు జనసేన వీరమహిళా అధ్యక్షురాలిగా కంటే శ్రీలక్ష్మి నియామకం

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మహిళ విభాగాన్ని బలోపేతం చేసేందుకు, మహిళలను రాజకీయంగా పెద్దపీట వేస్తూ రాజకీయ వారికి సముచిత స్థానం కల్పిస్తూ, రాజకీయాల్లోకి భాగస్వాములు చేసేదాని కోసం పవన్ కళ్యాణ్ గారి ఏదైతే జనసేన వీర మహిళ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఐదు మండలాల్లో మహిళా విభాగాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి సూచనల మేరకు నియామక కార్యక్రమంలో భాగంగా శనివారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు గుమ్మినేని వాణి భవాని సమక్షంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గోవిందరాజుపురానికి చెందిన కంటే శ్రీలక్ష్మిని మండల మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మహిళా శక్తిని తయారుచేసి మహిళలు అన్ని రంగాల్లో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా మహిళలకి చేతనందించే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలంగా పల్లెల్లో మహిళలని ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించి, వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వాళ్లకి అనేక విధాలుగా జనసేన పార్టీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం పెట్టిన పార్టీ జనసేన. యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మహిళలని అనేక విధాలుగా అణచివేతకు గురవుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు మహిళలని అనేక విధాలుగా ఏ రంగంలో కూడా ముందుకు రానివ్వకుండా అణిచివేయబడుతున్నారు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ మహిళా విభాగాన్ని వీర మహిళా విభాగంగా నామకరణం చేసి వాళ్ళ యొక్క వీరత్వాన్ని వాళ్ళ యొక్క తెలివితేటల్ని వంటింటికి పరిమితం కాదు, గ్రామ అభివృద్ధికి, మండల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుకొని రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మహిళా శక్తిని తయారు చేసే విధంగా ఈ యొక్క కార్యచరణ కొనసాగిస్తాం. ఈ కార్యక్రమంలో స్థానికులు కంటే సుధాకర్, సుబ్రమణ్యం, ఖాదరవల్లి, పవన్, జాకీర్, కోటి, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, సుమన్, మురళి తదితరులు పాల్గొన్నారు.