మండపేటను రాజమహేంద్రవరంలో విలినం చేయాలి: వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట, జిల్లాల పునర్విభజనలో మండపేటకు తీరని అన్యాయం జరగనుందని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం బాగు కోసం జెఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనపార్టీ తరుపున ఎల్లప్పుడూ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మండపేట నియోజకవర్గంకు సంబంధించిన అంశాలను వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళనని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు ఈ కొత్త జిల్లాలను మేము గుర్తించలేదని తెలిపారు. జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుండి మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలనేది నియోజకవర్గ ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు. జెఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే మండపేట బంద్ కు జనసేన తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతూ, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.