అమలాపురం జనసేనకే కేటాయించాలి

మంగళగిరి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శనివారం అమలాపురం నియోజకవర్గ పార్లమెంట్ ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డి.ఎం.ఆర్ శేఖర్ అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు బలమైన ఆదరణ ఉందని, ఈ ఎన్నికల్లో కోనసీమ జిల్లా వ్యాప్తంగా జనసేన విజయకేతనం ఎగరవేసేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా డిఎంఆర్ శేఖర్ కోరడం జరిగింది. డి.ఎం.ఆర్ శేఖర్ తో వారి సతీమణి భవాని, జనసేన అమలాపురం పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్, అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల సతీష్, అమలాపురం జనసేన సీనియర్ నాయకుడు కంచుపల్లి అబ్బులు పాల్గొన్నారు.‌