మహబూబాబాద్ పట్టణంలో మహా రక్తదాన శిబిరం

మహబూబాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసైనికులు, అభిమానులు రక్తదానం చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి ఆకుల సుమన్ సూచనల మేరకు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మెరుగు చక్రపాణి గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు వద్ది వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నాయకులు మేకల గోపాల్, కే సముద్రం, మండల అధ్యక్షుడు భూశెట్టి పవన్ కళ్యాణ్, జనసైనికులు రాధాకృష్ణ, కళ్యాణ్, నాని, మధు, ప్రవీణ్ శ్రీకాంత్, రాము, నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.