బొర్రా సమక్షంలో జనసేనలో చేరికలు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, కుంకలగుంట గ్రామ నాయకులు తాడికొండ అంకారావు, మదినేని గురవయ్య, జనసేన ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ దమ్మవరం నాగభూషణ్, జనసేన వాలంటీర్ ఆవుల రమణయ్య, ఆధ్వర్యంలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బొర్రా వెంకట అప్పారావు సమక్షంలో బందెల సుమిత్ వైసీపీ నంబర్, బండెల సామ్యుల్, గాలి సాగర్, లంజపల్లి గణేష్, గాలి క్రాంతి కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారు.