చిలుకూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిగా దొంతమాల జగదీష్

చిలుకూరు గ్రామ నూతన జనసేన పార్టీ కార్యవర్గాన్ని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులుగా నియమితులైన దంతమాల జగదీష్ ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ధారా పూర్ణచంద్రరావును మరియు గ్రామ నూతన కార్యవర్గ సభ్యులకు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసామని రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని గ్రామ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ నాయకులు కళ్యాణ్ రావు, భరత్, యశ్వంత్, వెంకటకృష్ణ, కిషోర్, బాలరాజు మరియు కార్యకర్తలు, చిలుకూరు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.