గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన నేపధ్యంలో జనసేన నేతల ముందస్తు అరెస్టులు

విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు పర్యటన భాగంగా ముందస్తుగా అరెస్టులు చేయడం జరిగింది. జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలియగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విజయనగరం అసెంబ్లీ ఇన్చార్జ్ డెంకాడ పోలీస్ స్టేషన్ కెళ్ళి వాళ్ళే రిలీజ్ చేసినంత వరకు ఉండడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మలక్ష్మీ రాజ్, మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, నియోజకవర్గ నాయకులు తుమ్ అప్పలరాజు దొర, భోగాపురం మండల నాయకులు నెల్లిమర్ల నియోజకవర్గం మండల అధ్యక్షులతో హౌ అరెస్ట్ చేసిన వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం నాయకులు మజి శివశంకర్, దాసరి యోగేష్, లోకల్ బాయ్ ప్రసాద్ జనసైనికులు పాల్గొనడం జరిగింది.