ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ కమిటీ సభ్యులకు సన్మానం

రాయచోటి, జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ కమిటీ సభ్యులను రాయచోటి జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్ మరియు చిరంజీవి యువత అధ్యక్షులు చిన్నారి జయరాం ఘనంగా సన్మానించడం జరీగంది. జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోన్ 1 కమిటీ కో- కన్వీనర్ గా పండ్రా రంజిత్ కుమార్ ని మరియు కమిటీ సభ్యులుగా రాజంపేట నియోజవర్గానికి చెందిన గుగ్గిళ్ళ నాగార్జున, శ్రీనివాసులుని నియమించిన సందర్భంగా రాయచోటి కొత్తపేటలో రాయచోటి జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్, చిరంజీవి యువత చిన్నారి జయరాం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయచోటి మండల టిడిపి నాయకులు భాను గోపాల్ రాజు, రవి నాయక్, రాజశేఖర్, నీతి రమేష్, నేతి వెంకటేష్, గుగ్గిళ్ళ వెంకటేష్, వీరేంద్ర, బాలాజీ, నరసింహ, టిడిపి నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.