తూర్పు గోనుగూడెంలో వైఎస్ఆర్సిపికి బిగ్ షాక్
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గోనుగూడెం గ్రామంలో వైఎస్ఆర్సిపికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అత్యంత కీలక నేతలు వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా సేవాదళ్ సెక్రటరీ అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు, మరో కీలక నేత దొడ్డ రాజు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు అలానే బత్తుల బలరామకృష్ణపై నమ్మకం సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోనుగూడెం గ్రామ టిడిపి, జనసేన సీనియర్ నేతలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-26-at-20.39.59-1024x482.jpeg)