డివిజన్ అధ్యక్షుల ఆత్మీయ సమావేశం

విజయవాడ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త
అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక కమిటీ సభ్యులు, వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.