దీదీకే మా సంఘీభావం: శివసేన

ముంబై : పశ్చిమ బెంగాల్‌లో జరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బెంగాల్‌లో తమ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న చర్చ సాగుతోందని, అయితే సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఈ అంశాన్ని చర్చించామని, బెంగాల్‌లో పోటీ చేయడం లేదని సంజయ్ రౌత్ తెలిపారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీకి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. దీదీ తమ పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దీదీని ఓడించేందుకు ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీదీకి అండగా నిలవాలని భావిస్తున్నామని, మా సంఘీభావం ఆమెకే ఉంటుందని సంజయ్ రౌత్ తెలిపారు. మమతా బెనర్జీ నిజమైన బెంగాలీ సింహాం అని, ఆమె ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.