పోలీస్ వ్యవస్థ రాజకీయ పార్టీలకు పనిచేయడం కాదు ప్రజల కోసం పని చేయండి: విశ్వనాథ్, పిడతల సుధాకర్

నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో విశ్వనాథ్ మరియు పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జనసేన కేంద్ర కమిటీ నాయకులపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ పోలీస్ వ్యవస్థ రాజకీయ పార్టీలకు తొత్తులు కాకుండా ప్రజల కోసం పనిచేయాలని జనసేన పార్టీకి చెందిన నాయకులు మంగళగిరి ఓ అపార్ట్మెంట్లో కేంద్ర కమిటీ జనసేన నాయకుల ఉండగా వారిపై పోలీసుల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నంద్యాల జనసేన కన్వీనర్ విశ్వనాథ్, పిడతల సుధాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలో జనసెన కార్యాలయంలోకి పోలీసులు చొరబడి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం పద్ధతి కాదని పోలీసులు ప్రజల కోసం పని చెయ్యాలి ప్రభుత్వం కోసం కాదన్నారు చేతగాని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని వారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో న్యాయబద్ధంగా వెళ్లి ప్రజల తీర్పును గౌరవించాలని హితువుపలకారు. ఈ సందర్భంగా నంద్యాల జనసేన కన్వీనర్ విశ్వనాధ్, పిడతల సుధాకర్ సవాల్ విసురుతూ జగన్ ఒకటే గుర్తుపెట్టుకో మీరు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు గాజులు తోడుకొని కూర్చోలేదు ఎదురొడ్డి నిలబడేందుకు సై అంటే సై అంటూ ప్రతి కార్యకర్త తన ప్రాణాలను లెక్కచేయకుండా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం పోరాడుతాం. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తూ వచ్చే టిడిపి జనసేన పార్టీలు ఉమ్మడి ప్రభుత్వలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు.