జనసేన-టిడిపి సమన్వయంతో పనిచేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి – మర్రాపు సురేష్

గజపతినగరం, జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జ్ మర్రాపు సురేష్ అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యవర్గం, జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం కావాలని, బూతు స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జనసేన-టీడీపీకి మద్దతుగా ఉన్న తరుణంలో ఇరు పార్టీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా సీనియర్ నాయకులు డా.మిడతాన రవికుమార్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల దీర్గ కాలికంగా ఉన్న సమస్యల పట్ల పోరాడాలని, గడిచిన 5 సంవత్సరాలలో మౌళిక వసతుల కల్పనలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యిన్దని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పట్టి పీడిస్తున్న వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేవిధంగా ప్రజలను కోరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, జనసైనికులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.