టర్కీలో కుప్ప కూలిన ఆర్మీ విమానం…11 మంది సైనికులు మృతి

ఇస్తాంబుల్‌ : తూర్పు టర్కీలో ఆర్మీ విమానం కుప్ప కూలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మృతుల్లో కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉస్మాన్‌ఎర్బాస్‌తో పాటు అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కుర్ధిష్‌ జనాభా కలిగిన బ్రిటీష్‌ ఫ్రావిన్స్‌లోని టాట్వాన్‌ పట్టణానికి సమీపంగా ఉన్న సిక్మీస్‌ అనే గ్రామానికి దగ్గరలో కౌగర్‌ రకం హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఇది సమీప ఫ్రావిన్స్‌ బింగోల్‌ నుండి టాట్వాన్‌కు వెళుతుండగా… గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే హెలికాఫ్టర్‌తో సంబంధాలు తెగిపోయామని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలంలోనే మరణించారని, గాయపడిన ఇద్దర్ని తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. అయితే ఈ మరణాలకు గల కారణాలు తెలియరాలేదు. దట్టమైన పొగమంచు కారణంగా… ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాఫ్టర్‌కు ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.