తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ జనసేన జెండా ఆవిష్కరించి, మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను బలంగా తీసుకెళ్ళాలని, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్ ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, చిగురుమామిడి మండల అధ్యక్షుడు గుండా సాయి చంద్, నేవూరి పవన్, మోరె శ్రీకాంత్, బుర్ర అజయ్ తదితరులు పాల్గొన్నారు.