నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్ పల్లి నియోజకవర్గం, శిల్ప అవెన్యూ దగ్గర ప్రశాంత్ నాయుడు, మహేంద్ర ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన రీలిష్ & చేరిష్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లిలోని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ కొల్లా శంకర్, మాదాసు అశోక్, వేణుగోపాల్, పులగం సుబ్బు, రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గాదె శ్రీనివాస్, కౌశిక్, పెద్దిరెడ్డి భరత్ వర్మ, సాయి వర్మ, నాగేంద్ర, కుమార్ చైతన్య, మాధవ నాయుడు, జయంత్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.