తెలుగు దేశం అభ్యర్థులను గెలిపించాలి: కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి

అమలాపురం: త్వరలో జరిగే లోకసభ, అసెఒబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన్, బీజేపి కూటమి అభ్యర్థులను గెలి పించాలని అమలాపురం పురపాలక 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్మివాసు విజ్ఞప్తి చేసారు. పొత్తులో భాగంగా అమలాపురం పార్లమెంట్ స్థానానికి గంటి హరీష్ మాధుర్(తెలుగు దేశం), అసెంబ్లీ స్థానానికి అయితా బత్తుల ఆనందరావు (తెలుగు దేశం)లకు సీట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భారీ మెజారిటీతో వారు విజయం సాధించాలి అని కోరుకుంటూ వారికి అభినఒదనలుతెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు తెలుగుదేశం -జనసేన -బీ జే పీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి అని కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మివాసు అన్నారు. 2014ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ పార్టీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచి విజయానికి కృషి చేసారు అఆ ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు విజయానికి కృషి చేసారు. పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే ప్రజలపక్షాన పోరాటం చేసారు. అధికారంలోకి వస్తే ప్రజలు పక్షాన వారి సమస్యలు పరిస్కరించే నాయకుడుగా మనం చూడాలి అన్నారు.