పొన్నూరులో పర్యటించిన జనసేన నాయకులు

పొన్నూరు నియోజకవర్గం, వెల్లలూరు గ్రామంలో మండల, గ్రామ అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు, సుధా వసంత్ ల పిలుపు మేరకు తుఫాను వల్ల పాడైన పంట పొలాలను మరియు నష్టపోయిన రైతులను పరామర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పొన్నూరు జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వడ్రాణం మార్కండేయులు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను వలన రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే వెళ్లి పరిశీలించి వాళ్లకి ధైర్యం చెప్పి ఆర్థిక చేయూతని ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పటివరకు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటే ఎలా..? మంత్రులు ఒక బస్సు వేసుకొని మళ్లీ జగనే ఈ రాష్ట్రానికి కావాలి అంటూ తిరుగుతున్నారు. ఆర్థికంగా నలిగిపోయిన రైతాంగాన్ని పరామర్శించినందుకా మళ్లీ జగన్ రెడ్డి కావాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేకల రామయ్య, పొన్నూరు టౌన్ ప్రెసిడెంట్ కరిముల్లా, చందు శివ కోటేశ్వరరావు, వెళ్లలూరు గ్రామస్తులు తన్నీరు ఉగ్ర నరసింహారావు, ఇక్కుర్తి సుబ్బారావు, చందు సుబ్బయ్య,రామారావు, తన్నీరు సారథి, జొన్నకూటి శ్రీనివాసరావు, సూదా చంద్రశేఖర రావు, పుప్పాల చంద్రయ్య, కసుకరు గ్రామ అధ్యక్షుడు ఎలవర్తి వెంకటేశ్వరరావు, పసుపులేటి సుబ్బారావు, నరేంద్ర, కొండముది రామారావు, వల్లంశెట్టి శ్రీధర్, తాళ్లపాలెం వాస్తవ్యులు పోకల సుధాకర్, పోకల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.