బండారు శ్రావణి ఎన్నికల ప్రచారానికి మద్దతు

శింగనమల, జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి ఎన్నికల ప్రచారానికి మద్దతుగా సోమవారం నార్పల మండలం గుంజేపల్లి నల్లపరెడ్డిపల్లి గ్రామాల్లో ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు, ఆలం వెంకట నరస నాయుడు, మండల సీనియర్ నాయకులు ఆకుల ఆంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొనడం జరిగింది. ఉమ్మడి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించి బండారు శ్రావణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, పొన్న తోటరామయ్య, చిన్నికృష్ణా, రవీంద్ర, ఆదినారాయణ, గుణ, ప్రసాద్ మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.